తాజా కబురు రాయికల్: ప్రభుత్వం కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం అమలు చేసిన సెప్టెంబర్ 1 వ తేదీ ఉద్యోగ ఉపాధ్యాయులకు చీకటి దినమని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాయికల్ మండలశాఖ సభ్యులు ఆవేదన వ్యక్తంచేశారు. తపస్ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు మంగళవారం పెన్షన్ విద్రోహ దినంగా పాటించారు. మధ్యాహ్న విరామ సమయంలో రాష్ట్రప్రభుత్వం సి.పి.యస్ విధానం రద్దుపరిచి పాతపెన్షన్ విధానమే అమలుచేయాలని కోరుతూ మండల తహశీల్దార్ కె.మహేశ్వర్ కు వినతిపత్రాన్ని అందజేశారు. అన్ని పాఠశాల ల్లో నల్ల బ్యాడ్జీలతో ఉపాధ్యాయులు నిరసన వ్యక్తంచేశారు.ఈ కార్యక్రమంలో తపస్ రాష్ట్ర బాధ్యులు ఎ.రాజేంద్రప్రసాద్, జిల్లా కార్యదర్శి చెరుకు మహేశ్వర శర్మ ,మండలశాఖ అధ్యక్షులు బెజ్జెంకి అనిల్ రావు, కార్యదర్శి రాజేందర్, సభ్యులు ఎద్దండి రమేశ్,వి.మధు నీలి నాగరాజు జయదేవవర్మ తదితరులు పాల్గొన్నారు.
Latest article
తుంగూర్ లో దారుణం…ఎంపీడీవో,ఎస్సైపై పెట్రోల్ పోసిన రైతు,ఎంపీడీవోకు గాయాలు ..
తాజాకబురు జగిత్యాల:జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం తుంగూర్ లో దారుణం చోటుచేసుకుంది, ఇంటి నుండి రహాదారి కోసం సర్వే నిర్వహిస్తుండగా అక్కడె ఉన్న చుక్క గంగాధర్ అనే రైతు పొలంలో కొట్టె మందు...
కట్లకుంట కెనాల్ ప్రమాదంలో నీటిలోనె ఉండగా కదిలించిన చివరి సంబాషణ…
కెనాల్ ప్రమాదంలో కదికించిన చివరి సంబాషణలు.....
నాన్న మనం నీటిలో పడిపోయాం,ఎలా...ఎలా...ఏం కాదమ్మ ఈ కారు చుట్టు అద్దాలు ఉన్నాయి నీళ్లు లోపలికి చేరెవరకు మనం బయట పడుతాం, అన్నయ్యకు,నాకు,నీకు ఈత వచ్చు మనం...
ఆ కుటుంబంలో అన్నీ ప్రేమికుల రోజె…….జన్మించింది,ప్రేమించింది,ప్రేమను వ్యక్తికరించింది,వివాహాం చేసుకున్నది ఫిబ్రరవరి 14..
ప్రేమికుల రోజు పండగ....జన్మించింది,ప్రేమించింది,ప్రేమను వ్యక్తికరించింది,వివాహాం చేసుకున్నది ఫిబ్రరవరి 14..
తాజాకబురు:ప్రేమ ఈ రెండు పదాలు ప్రేమికులకు ప్రపంచాన్ని సుందరంగా చూసె విధంగా చేస్తాయి, ప్రేమ ఈ రెండు పదాలు రెండు కుటుంబాలను కలుపుతాయి,సంతోషాన్ని నింపుతాయి,...