పెద్దపల్లిలో గుప్తనిధుల కోసం తవ్వకాలు ఆరుగురి అరెస్ట్..
పెద్దపల్లి తాజాకబురు ప్రతినిధి: గుప్తనిధుల కోసం తవ్వకాలు జరుపుతున్న ఆరుగురు ముఠా సభ్యులను పట్టుకున్న సంఘటన పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది,. మంగళవారం జిల్లా కేంద్రం శివాలయం వీధిలోని ఒక పురాతన ఇంట్లో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతున్నారే విశ్వసనీయ సమాచారం మేరకు పెద్దపల్లి ఎస్ట్ రాజేష్ ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు నిర్వహించి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఎ తెలిపారు.