ధర్మపురి తాజా కబురు: జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణములో రోజు రోజుకు కోవిడ్ -19 (కరోనా వైరస్) కేసుల నమోదు దృష్ట్యా ,గత 2,3 రోజుల నుండి ధర్మపురి పట్టణం,చుట్టు ప్రక్కల గ్రామాలలో ఎక్కువ సంఖ్యలో పాజిటివ్ కేసులు వచ్చినందున. శ్రీ లక్ష్మీ నర్సింహస్వామివారి దేవస్థానములో పనిచేయుచున్న అర్చకులు, సిబ్బందిలో ముఖ్యమైన ఐదుగురికి కూడా కరోనా పాజిటివ్ రిపోర్ట్స్ వచ్చినవి. ఈ సందర్భముగా దేవాలయములో విధులు నిర్వర్తించుచున్న ఇతర అర్చక సిబ్బంది భయాందోళనలకు గురి అగుచున్నారు. దేవాలయములో విధులు నిర్వర్తించుచున్న ఇతర అర్చకులు , సిబ్బంది అందరికి టెస్టులు చేయించు విషయములో వైరైస్ వ్యాప్తి చెందకుండా ఉండుటకై ఇట్టి విపత్కర పరిస్థితుల నుండి దేవాలయ అర్చకులు,సిబ్బంది ధరఖాస్తు మేరకు, దేవాదాయశాఖ ఉన్నతాధికారులు ఫోన్లో ఇచ్చిన మౌఖిక ఆదేశములు ప్రకారము అర్చకులచే అంతర్గతంగా పూజలు నిర్వహిస్తూ భక్తులకు దర్శనం లేకుండా దేవాలయమును తేది.24-08-2020 నుండి 28-08-2020 వరకు ఐదు రోజులు మూసి వేస్తున్నట్లు ఆలయ కార్య నిర్వహణ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు.
Latest article
తుంగూర్ లో దారుణం…ఎంపీడీవో,ఎస్సైపై పెట్రోల్ పోసిన రైతు,ఎంపీడీవోకు గాయాలు ..
తాజాకబురు జగిత్యాల:జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం తుంగూర్ లో దారుణం చోటుచేసుకుంది, ఇంటి నుండి రహాదారి కోసం సర్వే నిర్వహిస్తుండగా అక్కడె ఉన్న చుక్క గంగాధర్ అనే రైతు పొలంలో కొట్టె మందు...
కట్లకుంట కెనాల్ ప్రమాదంలో నీటిలోనె ఉండగా కదిలించిన చివరి సంబాషణ…
కెనాల్ ప్రమాదంలో కదికించిన చివరి సంబాషణలు.....
నాన్న మనం నీటిలో పడిపోయాం,ఎలా...ఎలా...ఏం కాదమ్మ ఈ కారు చుట్టు అద్దాలు ఉన్నాయి నీళ్లు లోపలికి చేరెవరకు మనం బయట పడుతాం, అన్నయ్యకు,నాకు,నీకు ఈత వచ్చు మనం...
ఆ కుటుంబంలో అన్నీ ప్రేమికుల రోజె…….జన్మించింది,ప్రేమించింది,ప్రేమను వ్యక్తికరించింది,వివాహాం చేసుకున్నది ఫిబ్రరవరి 14..
ప్రేమికుల రోజు పండగ....జన్మించింది,ప్రేమించింది,ప్రేమను వ్యక్తికరించింది,వివాహాం చేసుకున్నది ఫిబ్రరవరి 14..
తాజాకబురు:ప్రేమ ఈ రెండు పదాలు ప్రేమికులకు ప్రపంచాన్ని సుందరంగా చూసె విధంగా చేస్తాయి, ప్రేమ ఈ రెండు పదాలు రెండు కుటుంబాలను కలుపుతాయి,సంతోషాన్ని నింపుతాయి,...