తాజా కబురు రాయికల్: ప్రభుత్వం కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం అమలు చేసిన సెప్టెంబర్ 1 వ తేదీ ఉద్యోగ ఉపాధ్యాయులకు చీకటి దినమని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాయికల్ మండలశాఖ సభ్యులు ఆవేదన వ్యక్తంచేశారు. తపస్ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు మంగళవారం పెన్షన్ విద్రోహ దినంగా పాటించారు. మధ్యాహ్న విరామ సమయంలో రాష్ట్రప్రభుత్వం సి.పి.యస్ విధానం రద్దుపరిచి పాతపెన్షన్ విధానమే అమలుచేయాలని కోరుతూ మండల తహశీల్దార్ కె.మహేశ్వర్ కు వినతిపత్రాన్ని అందజేశారు. అన్ని పాఠశాల ల్లో నల్ల బ్యాడ్జీలతో ఉపాధ్యాయులు నిరసన వ్యక్తంచేశారు.ఈ కార్యక్రమంలో తపస్ రాష్ట్ర బాధ్యులు ఎ.రాజేంద్రప్రసాద్, జిల్లా కార్యదర్శి చెరుకు మహేశ్వర శర్మ ,మండలశాఖ అధ్యక్షులు బెజ్జెంకి అనిల్ రావు, కార్యదర్శి రాజేందర్, సభ్యులు ఎద్దండి రమేశ్,వి.మధు నీలి నాగరాజు జయదేవవర్మ తదితరులు పాల్గొన్నారు.
Latest article
డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ సేవలు చిరస్మరణీయం-ఎస్పీ రాహుల్ హెగ్డే
రాజన్న సిరిసిల్ల తాజా కబురు: బాబు జగ్జీవన్ రామ్ 114వ జయంతి సందర్బం గా ఈరోజు జిల్లా పోలీస్ కార్యాల యంలో జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూల...
రాయికల్ లో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు
జగిత్యాల తాజా కబురు: రాయికల్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు జోహార్ బాబా జగ్జీవన్ రామ్ ఆశయాలు వర్ధిల్లాలి...
విదేశీ జర్నలిస్టులు ముత్యంపేటకు ఎందుకు వచ్చారు… ?
గల్ఫ్ వలసలపై అధ్యయనం కోసం జగిత్యాల జిల్లాను సందర్శించిన విదేశీ జర్నలిస్టులు
తాజా కబురు డెస్క్: గల్ఫ్ వలస కార్మికుల ఆర్ధిక, సామాజిక జీవన స్థితిగతులను అధ్యయనం చేయడానికి ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న ఇద్దరు విదేశీ జర్నలిస్టులు...