జగిత్యాల: మేడ్చల్ -మల్కాజిగిరి జిల్లాలోని కూకటపెళ్లి లోని కాముని చెరువు శిఖం భూమిలో అక్రమ నిర్మాణాలను కూల్చడానికి వెళ్లిన రెవెన్యూ అధికారులపై, ఉద్యోగులపై భూకబ్జాదారులు దాడి చేయడాన్ని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్షుడు ఎం.డీ.వకీల్, అధ్యక్షుడు హరి అశోక్ కుమార్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు భోగ శశిధర్ లు తీవ్రంగా ఖండించారు. శనివారం వారు రెవెన్యూ భవన్ లో మాట్లాడుతూ దాడికి పాల్పడ్డ, పురికొల్పిన నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని, ఇలాంటి ఘటనలు జిల్లాల్లో పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు. జిల్లాల్లో విలువైన ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా రాత్రింబవళ్ళు విధులు నిర్వహిస్తున్న రెవెన్యూశాఖ ఉద్యోగులకు, అధికారులకు ప్రభుత్వ భూముల పరిరక్షణ లో పోలీసు భద్రత కల్పించాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి చెలుకల కృష్ణ, కోశాధికారిగా ఎన్. తిరుమల రావ్, రమేష్ , రాజేందర్ రావ్, రాజేంద్రప్రసాద్, సత్యనారాయణ, అబూబాకర్ తదితరులు పాల్గొన్నారు.
Latest article
కట్కాపూర్ లో 85, కోండ్రికల్ లో 70 పాజిటివ్ కేసులు-కరోనా విస్తరించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి: జిల్లా కలెక్టర్...
జగిత్యాల,ఏప్రిల్,12 (తాజా కబురు):: కరోనా పాజిటివ్ కేసులు ప్రతిరోజు పెరిగిపోతున్న తరుణంలో ఒకరినుండి మరొకరికి సంక్రమించకుండా కట్టుదిట్టమైన చర్యలను చేపట్టాలని జిల్లా కలెక్టర్ జి. రవి అన్నారు. సోమవారం రాయికల్...
మండల అధికారులతో జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సమీక్ష సమావేశం
జగిత్యాల తాజా కబురు: జిల్లా పరిషత్ క్యాంప్ కార్యాలయంలో గ్రామీణ,పట్టణ మండలాల ఎంపీడీఓలతో మంగళవారం జిల్లా జడ్పీ చైర్ పర్సన్ దావ వసంతసురేశ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...
డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ సేవలు చిరస్మరణీయం-ఎస్పీ రాహుల్ హెగ్డే
రాజన్న సిరిసిల్ల తాజా కబురు: బాబు జగ్జీవన్ రామ్ 114వ జయంతి సందర్బం గా ఈరోజు జిల్లా పోలీస్ కార్యాల యంలో జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూల...