తాజా కబురు రాయికల్ రూరల్:మండలంలోని వడ్డే లింగాపూర్ గ్రామం అంలో అంబేద్కర్ కమ్యూనిటీ భవనం వద్ద బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి సోమవారం జగిత్యాల జిల్లా ఎస్సీ కార్పొరేషన్ స్టాండింగ్ చైర్మన్ బత్తిని అరుణ భూమి పూజ చేశారు, తెలంగాణ అంబేద్కర్ సంఘం మరియు అంబేద్కర్ సంఘాల నాయకులు మాట్లాడుతూ గ్రామ సర్పంచ్ కమ్యూనిటీ భవనాన్ని కావాలనే వివాదం చేస్తున్నారని దళితులకు చెందిన అంబేద్కర్ కమ్యూనిటీ భవనం గ్రామానికి ఆపాదించడం సరికాదని అన్నారు.తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇరుగురాళ్ల ఆనందం ,జగిత్యాల కౌన్సిలర్ బాలే శంకర్ మాట్లాడుతూ దళితులకు చట్టబద్ధంగా చెందాల్సిన నిధులు కేటాయించక పోగా వారికున్న కమ్యూనిటీ భవనాన్నీ వివాదం చేయవద్దని అన్నారు.ఈ కార్యక్రమంలో తిరుపతయ్య ,ఈధుల లక్ష్మణ్ కుమార్ ,మోర్తాడు సాయి, వడ్లూరు దినేష్, వడ్లూరి రాజేందర్ ,మారంపల్లి రమేష్, నరేష్ ,శివ ,రాజేందర్ ,లక్ష్మణ్ వినోద్ ,సాయి ,శ్యాం తదితరులు పాల్గొన్నారు .
Latest article
మండల అధికారులతో జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సమీక్ష సమావేశం
జగిత్యాల తాజా కబురు: జిల్లా పరిషత్ క్యాంప్ కార్యాలయంలో గ్రామీణ,పట్టణ మండలాల ఎంపీడీఓలతో మంగళవారం జిల్లా జడ్పీ చైర్ పర్సన్ దావ వసంతసురేశ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...
డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ సేవలు చిరస్మరణీయం-ఎస్పీ రాహుల్ హెగ్డే
రాజన్న సిరిసిల్ల తాజా కబురు: బాబు జగ్జీవన్ రామ్ 114వ జయంతి సందర్బం గా ఈరోజు జిల్లా పోలీస్ కార్యాల యంలో జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూల...
రాయికల్ లో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు
జగిత్యాల తాజా కబురు: రాయికల్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు జోహార్ బాబా జగ్జీవన్ రామ్ ఆశయాలు వర్ధిల్లాలి...