ధర్మపురి తాజా కబురు: జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణములో రోజు రోజుకు కోవిడ్ -19 (కరోనా వైరస్) కేసుల నమోదు దృష్ట్యా ,గత 2,3 రోజుల నుండి ధర్మపురి పట్టణం,చుట్టు ప్రక్కల గ్రామాలలో ఎక్కువ సంఖ్యలో పాజిటివ్ కేసులు వచ్చినందున. శ్రీ లక్ష్మీ నర్సింహస్వామివారి దేవస్థానములో పనిచేయుచున్న అర్చకులు, సిబ్బందిలో ముఖ్యమైన ఐదుగురికి కూడా కరోనా పాజిటివ్ రిపోర్ట్స్ వచ్చినవి. ఈ సందర్భముగా దేవాలయములో విధులు నిర్వర్తించుచున్న ఇతర అర్చక సిబ్బంది భయాందోళనలకు గురి అగుచున్నారు. దేవాలయములో విధులు నిర్వర్తించుచున్న ఇతర అర్చకులు , సిబ్బంది అందరికి టెస్టులు చేయించు విషయములో వైరైస్ వ్యాప్తి చెందకుండా ఉండుటకై ఇట్టి విపత్కర పరిస్థితుల నుండి దేవాలయ అర్చకులు,సిబ్బంది ధరఖాస్తు మేరకు, దేవాదాయశాఖ ఉన్నతాధికారులు ఫోన్లో ఇచ్చిన మౌఖిక ఆదేశములు ప్రకారము అర్చకులచే అంతర్గతంగా పూజలు నిర్వహిస్తూ భక్తులకు దర్శనం లేకుండా దేవాలయమును తేది.24-08-2020 నుండి 28-08-2020 వరకు ఐదు రోజులు మూసి వేస్తున్నట్లు ఆలయ కార్య నిర్వహణ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు.
Latest article
కట్కాపూర్ లో 85, కోండ్రికల్ లో 70 పాజిటివ్ కేసులు-కరోనా విస్తరించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి: జిల్లా కలెక్టర్...
జగిత్యాల,ఏప్రిల్,12 (తాజా కబురు):: కరోనా పాజిటివ్ కేసులు ప్రతిరోజు పెరిగిపోతున్న తరుణంలో ఒకరినుండి మరొకరికి సంక్రమించకుండా కట్టుదిట్టమైన చర్యలను చేపట్టాలని జిల్లా కలెక్టర్ జి. రవి అన్నారు. సోమవారం రాయికల్...
మండల అధికారులతో జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సమీక్ష సమావేశం
జగిత్యాల తాజా కబురు: జిల్లా పరిషత్ క్యాంప్ కార్యాలయంలో గ్రామీణ,పట్టణ మండలాల ఎంపీడీఓలతో మంగళవారం జిల్లా జడ్పీ చైర్ పర్సన్ దావ వసంతసురేశ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...
డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ సేవలు చిరస్మరణీయం-ఎస్పీ రాహుల్ హెగ్డే
రాజన్న సిరిసిల్ల తాజా కబురు: బాబు జగ్జీవన్ రామ్ 114వ జయంతి సందర్బం గా ఈరోజు జిల్లా పోలీస్ కార్యాల యంలో జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూల...