ఆ ఆడపిల్ల ఆత్మశాంతించింది,మరొకరు తప్పుచేస్తె మరణశిక్ష ఉంటుందని నిరూపించింది.
దిశ కేసులో దిమ్మదిరిగె ముగింపునిచ్చిన పోలిసులు..
సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తుండగా పారిపోయిన నిందుతులపై కాల్పులు జరిపిన పోలిసులు
నలుగురు నిందితులు నిందుతులు మ్రుతి….
షాద్ నగర్ : దిశ హత్య కేసు నిందితుల ఎన్కౌంటర్ను సీపీ సజ్జనార్ నిర్ధారించారు. ఈ తెల్లవారుజామున 3 నుంచి 6 గంటల మధ్య ఎన్కౌంటర్ జరిగినట్లు ఆయన వెల్లడించారు. చటాన్పల్లి వద్ద ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలిపారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశాన్ని సీపీ పరిశీలించారు.కేపిదిశ హత్యకేసులో నిందితులను పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. షాద్నగర్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తుండగా నలుగురు నిందితులు పారిపోయారు. పారిపోతున్న నిందితులపై పోలీసులు కాల్పులు జరపడంతో నలుగురు నిందితులు మృతి చెందారు. గత నెల 27వ తేదీన వెటర్నరీ డాక్టర్పై అత్యాచారం చేసిన నిందితులు హత్య చేసి చటాన్పల్లి వద్ద బ్రిడ్జి కింద శవాన్ని కిరోసిన్ పోలీస్ కాల్చిన సంగతి తెలిసిందే.అదే ప్రదేశంలో పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ ప్రదేశంలో చీకటిగా ఉన్న పరిస్థితులను అనుకూలంగా చేసుకున్న నిందితులు పోలీసులపై దాడికి దిగారు. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగింది. జైల్లో ఉన్నప్పుడు నిందితులను వేరువేరుగా ఉంచారు.నిందితులను ఘటనకు పాల్పడిన ప్రాంతానికి తీసుకురాగానే అరగంటపాటు విచారణ జరిగిన అనంతరం ఆరిఫ్ మొదట పోలీసులపై దాడి చేశాడు. అనంతరం మిగితా ముగ్గురు పోలీసులపై తిరగబడ్డారు. నిందితులు తుపాకులు లాక్కొని పారిపోతుండగా పోలీసులు జరిపిన కాల్పుల్లో ఆరిఫ్ పాషా, జొల్లు శివ, నవీన్, చెన్నకేశవులు మృతి చెందారు…
సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ కామెంట్స్…
దిశను కిడ్నాప్ చేసి, అత్యాచారం చేసి ఆపై హత్య చేసిన నిందితులు
ఈ కేసులో అనేక కోణాల్లో దర్యాప్తు చేశాం..
నిందితులు మహ్మద్ ఆరిఫ్, శివ, నవీన్, చెన్నకేశవులను అరెస్ట్ చేశాం..
నవంబర్ 30వ తేదీన నిందితులను మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చాం..
అనంతరం చర్లపల్లి జైలుకు తరలించాం.
ఆ తర్వాత నిందితులను జైలు నుంచి కస్టడీలోకి తీసుకున్నాం..
కస్టడీలోకి తీసుకున్న తర్వాత వారిని అనేక కోణాల్లో ప్రశ్నించాం…
కొన్ని వస్తువులను రికవరీ కోసం ఘటనా స్థలానికి నిందితులను తీసు కొచ్చం
సీన్ రీ కన్స్ట్రక్షన్ చేస్తుండగా నిందితులు పోలీసులపై దాడికి దిగారు
దిశ ఫోన్ ఇక్కడ పెట్టాం, అక్కడ పెట్టామంటూ కొద్దిసేపు అటూ ఇటూ తిరిగి ఆ తర్వాత పోలీసులపై రాళ్లు, చేతికి దొరికిన కర్రలతో దాడి చేశారు
వెపన్స్ తీసుకుని పోలీసులపై కాల్పులకు యత్నించారు
ఈ దాడిలో ఓ ఎస్సై, కానిస్టేబుల్కు గాయాలు కూడా అయ్యాయి
లొంగిపోవాలని పోలీసులు హెచ్చరించినా నిందితులు వినకపోవడంతో చివరకు పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చింది
కొద్ది సేపటి తర్వాత ఎలాంటి స్పందన లేకపోవడంతో ముందుకు వెళ్లి చూడగా.. మృతదేహాలు పడి ఉన్నాయి
పోలీసుల కాల్పుల్లో నలుగురు నిందితులు మృతి